Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముక్కనుమ నాడు ఆ వ్రతం చేయాలట.. సంక్రాంతి రోజున దానాలు చేస్తే?

Advertiesment
sankranti
ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. ముక్కనుమ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు గడిచిన నాలుగువ రోజున వస్తుంది. ఈ రోజున కొత్తగా వివాహమైన మహిళలు 'సావిత్రి గౌరివత్రం' అంటే 'బొమ్మల నోము' పడతారు. దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన తర్వాత ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు. ఇక సంక్రాంతినాడు దానాలు చేయడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. 
 
మకర సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దారిద్ర్య బాధలు తొలగిపోతాయని విశ్వాసం. సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకలసంపదలతో పాటు దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు కొన్ని కొన్ని వ్రతాలను ఆచరించడం చేస్తారు. వాటిలో గొబ్బిగౌరి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది.. పోతులూరి వీరబ్రహ్మం