Publish Date: Tue, 11 Jul 2023 (11:00 IST)
Updated Date: Tue, 11 Jul 2023 (11:03 IST)
మంగళవారం రోజున దుర్గమ్మకు నిమ్మపండుతో దీపం వెలిగిస్తే..? కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ రోజున పరాశక్తిని పూజించడం ద్వారా సర్వశుభాలు కోరుతాయి.
మంగళవారం పూట రాహు కాలంలో నిమ్మ పండుతో దీపం వెలిగించి పూజిస్తే దుష్టశక్తులు దూరమవుతాయని, అలాగే రాహు కేతు దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అలాగే నటరాజ స్వామిని మంగళవారం ఆరాధిస్తే.. సౌభాగ్యం సిద్ధిస్తుంది. మంగళవారం ఉపవాసం ఉండి దుర్గాదేవిని పూజించడం చాలా ప్రత్యేకం. మంగళవారం నాడు ఉపవాసం ఉండి, రాహుకాలంలో దుర్గాదేవిని నిమ్మపండులో దీపం వెలిగించి పూజిస్తే దుష్టశక్తులు తొలగుతాయని చెబుతారు.
దుర్గమ్మకు రాహుకాలంలో మంగళవారం దీపం వెలిగించడం.. గ్రామ దేవతలను పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.