Publish Date: Tue, 05 Mar 2024 (16:04 IST)
Updated Date: Tue, 05 Mar 2024 (17:02 IST)
పరాశక్తి అనుగ్రహం పొందాలంటే నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. మహా శివుడి అనుగ్రహం కోసం మహా శివరాత్రి రోజున జాగరణ చేయడం ద్వారా, ఆయన్ని పూజించడం సర్వశుభాలు చేకూరుతాయి. శివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు జరిగే అభిషేకాలు, ఆరాధనలో పాల్గొనాలి. ఈ రోజు జరిగే ఆరాధనల్లో పాల్గొనడం ద్వారా మోక్షం ప్రాప్తిస్తుందని ఆధ్మాత్మిక పండితులు అంటున్నారు.
శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో ఈశ్వరుడిని పూజించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. శివరాత్రి రోజున స్వామి వారికి అభిషేకాలు చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పంచకవ్యం, పంచామృతం, విభూతి, పచ్చకర్పూరం, చందనం, బియ్యంపిండి అభిషేకానికి ఇవ్వడం ఈతిబాలను తొలగిస్తుంది.