Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్తీక మాసంలో శివునికి నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే?

కార్తీక మాసంలో శివునికి నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే?
, ఆదివారం, 25 నవంబరు 2018 (16:37 IST)
కార్తీక మాసంలో శివునికి అభిషేకం చేయించిన వారికి ఐశ్వర్యాలు, వంశాభివృద్ధి చేకూరుతుంది. కార్తీకమాసం శివకేశవులకు ప్రీతికరం. ఈ మాసంలో తులసీ పూజ చేయడం.. తులసీ మాల ధరించడం, ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం ద్వారా కోరిన కోరికలు నెరవేర్చుకోవచ్చు. అలాగే ఈ మాసంలో చేసే పూజలతో శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు సంతృప్తి చెందుతారని విశ్వాసం. 
 
శ్రీ మహా విష్ణువు అలంకార ప్రియుడైతే.. శివుడు అభిషేక ప్రియుడనే విషయం తెలిసిందే. అలాంటి శివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో అభిషేకం చేస్తే విశేష ఫలితాలు వుంటాయని పండితులు అంటున్నారు. అందుకే పాలతో కార్తీక మాసంలో శివునికి అభిషేకం చేయించిన వారికి సకల శుభాలు చేకూరుతాయి. పెరుగుతో అభిషేకిస్తే.. ఆరోగ్యం, ఆయుష్షు చేకూరుతుంది. 
 
నెయ్యితో అభిషేకం చేయడం ద్వారా సంతానం, తేనెతో అభిషేకం చేయడం వలన తేజస్సు లభిస్తాయి. కొబ్బరినీళ్లతో అభిషేకం చేయడం ద్వారా సంపదలు చేకూరుతాయి. మామిడి రసంతో శివునికి అభిషేకం చేస్తే ధనధాన్యాలు సమకూరుతాయి. నేరేడు పండు రసంతో శివునికి అభిషేకం చేయిస్తే.. ఉద్యోగ ప్రాప్తి, విజయాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

25-11-2018-ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఒకే కాలంలో అనేక పనులు వద్దు..