Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారాహి దేవికి పెసళ్లతో దీపం వెలిగిస్తే..? (video)

Advertiesment
Varahi Puja
సాధారణంగా వారాహి రూపంలో వుండే వారాహి దేవత సప్తకన్యల్లో ఒకరు. ఆమె కారు మేఘం వంటి రూపంలో వుంటుందని దేవీ భాగవతంలో చెప్పబడుతోంది. ఈ వారాహి దేవిని పూర్వకాలంలో రహస్యం రాజులు, మంత్రులు, సైనికులు, మాంత్రికులు, తాంత్రికులు, శత్రువులు వుండేటటువంటి వారు కొలిచేవారట.
 
ప్రస్తుతం ఆమెను మాసాల్లో వచ్చే పంచమి నాడు భక్తులు కొలవడం చేస్తున్నారు. కలియుగంలో వారాహి రూపంలో వున్న ఈ మాతను పూజించే వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఈమె మహా విష్ణువు అంశం. అలాంటి ఆమెను కొలిస్తే కోరికలు ఇట్టే నెరవేరుతాయి. 
 
ఇక మీ కోరికలు సులభంగా నెరవేరాలంటే ఈ పరిహారాన్ని ఇంట్లో చేయవచ్చు అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. వారాహి అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు తప్పక నెరవేరుతాయి. ఈ పరిహారాన్ని ఇంట్లో కానీ లేకుంటే వారాహి అమ్మవారు కొలువై వుండే ఆలయలోనూ చేయవచ్చు. ఇంతకీ ఆ పరిహారం ఏంటో చూద్దాం. 
 
పెసళ్లను ఓ ప్లేటులోకి తీసుకుని చదునుగా చేసుకోవాలి. వారాహిదేవి పటం ముందు ఈ పెసళ్లతో నింపిన ప్లేటును వుంచి.. దానిపై రెండు ప్రమిదలతో నేతి దీపం లేకుంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా తొమ్మిది రోజులు వరుసగా ఈ దీపాన్ని వెలిగించి.. వారాహి అమ్మవారిని పూజించాలి.
 
ఇలా చేస్తే మీ సంకల్పం సిద్ధిస్తుందని వారాహి దేవి ఉపాసకులు చెప్తున్నారు. ఈ దీపం వెలిగించడం ద్వారా వారాహి దేవి అనుగ్రహం లభిస్తుంది. తొమ్మిది రోజుల తర్వాత ఈ పెసళ్లను ఆవులకు మేతగా ఇవ్వడం లేదా.. చెరువుల్లో వేయడం చేయొచ్చు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26-07-2023 బుధవారం రాశిఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన...