Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శివుని ఆరాధనకు గురువారం కూడా శ్రేష్టమే.. తెలుసా..?

శివుని ఆరాధనకు గురువారం కూడా శ్రేష్టమే.. తెలుసా..?
, బుధవారం, 7 ఏప్రియల్ 2021 (18:49 IST)
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. 
 
ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి. తుమ్మి పూలు , మోదుగ పూలు శ్రేష్టమైనవి. తరువాత శివఅష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పించి , ఆ విభూతిని నుదిటిన ధరించాలి.
 
సాయంత్రం వరకు ఉపవాసము వుండావి. పాలు, పండ్లు వంటివి తీసుకోవచ్చు. సాయంత్రం శివాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపారాధన చేయాలి. స్వామిని పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు.
 
అలాగే గురువారం కూడా పరమేశ్వర పూజ విశిష్ఠ ఫలితాలను ఇస్తుంది. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. 
 
అలాగే ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. ఉమామహేశ్వరులను వేకువ జామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం-13.4.2021 ఉదయం 5.45 గంటల నుంచి..?