Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహాభరణి- యమదీపం.. కాకులకు నల్ల నువ్వులు.. ఆవు నెయ్యి?

Deepam

సెల్వి

, శనివారం, 21 సెప్టెంబరు 2024 (10:23 IST)
మహాభరణి పితృపక్షంలో వస్తుంది. ఈ రోజున పితృ దేవతలకు తర్పణం ఇస్తే ముక్తిని పొందుతారు. దీనిని పితృదేవతల ఆశీర్వాదం పొందేందుకు ఈ రోజుగా పరిగణించబడుతుంది. మొత్తం 27 నక్షత్రాలలో రెండవ నక్షత్రంగా భరణిని పరిగణించబడుతుంది. 
 
ఈ భరణి నక్షత్రానికి శుభఫలితాలను ఇస్తుంది. ఇంకా పితృదోషాలను దూరం చేస్తుంది. ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు కోసం పితృపక్షంలో వచ్చే ఈ భరణి నక్షత్రం రోజున పితృదేవతలను పూజించడం మంచిది. చతుర్థశి రోజున వచ్చే ఈ భరణి నక్షత్రం నాడు యమదీపం వేయడం ద్వారా నరకం అనుభవించే పితరులను స్వర్గానికి పంపుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తద్వారా పితరుల ఆశీర్వాదం అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. 
 
ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే.. 
ఈ దీపాన్ని భరణి నక్షత్రం వున్న రోజు బ్రహ్మముహూర్తం లేదా.. సాయంత్రం పూట ఇంటికి వెలుపల వెలిగించాలి. ఈ దీపం దక్షిణ ముఖాన వుండాలి. దీప జ్యోతి దక్షిణం వైపు చూసేలా వుండాలి. అలా ఇంట్లో వెలిగించడం కుదరకపోతే.. ఈ యమ దీపాన్ని శనీశ్వరుడి ముందు వెలిగించాలి. 
 
ఈ రోజున అన్నదానం చేయడం.. నల్ల నువ్వులు, ఆవు నెయ్యి కాస్త కలిపిన అన్నాన్ని కాకులకు పెట్టడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇలా చేస్తే పితృశాపాలు, పితృదోషాలు తొలగిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21-09-2024 శనివారం దినఫలితాలు : ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు..