Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్తను చితకబాది.. కళ్లముందే భార్యపై అత్యాచారం.. ఎక్కడ?

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్తను చితకబాది ఆయన కళ్లెదుటే భార్యను నలుగురు కామాంధులు అత్యాచారం చేశారు. ఈ ఘటన హర్యానాలో ఆదివారం రాత్రి జరుగగా, సోమవారం వెలుగు చూసింది. ఈ వివరాలను పలిశీలిస్తే,

భర్తను చితకబాది.. కళ్లముందే భార్యపై అత్యాచారం.. ఎక్కడ?
, మంగళవారం, 23 జనవరి 2018 (13:26 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్తను చితకబాది ఆయన కళ్లెదుటే భార్యను నలుగురు కామాంధులు అత్యాచారం చేశారు. ఈ ఘటన హర్యానాలో ఆదివారం రాత్రి జరుగగా, సోమవారం వెలుగు చూసింది. ఈ వివరాలను పలిశీలిస్తే, 
 
గుర్గావ్‌లోని సెక్టార్ 56కు చెందిన దంపతులు తమ బంధువుల ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్‌ను ఆదివారం రాత్రి వెళ్లారు. భోజనం చేశాక రాత్రి 10 గంటల సమయంలో తమ ఇంటికి దంపతులిద్దరూ తిరిగి వస్తుండగా.. టాయిలెట్ కోసమని సెక్టార్ 56లోని బిజినెస్ పార్క్ వద్ద కారును ఆపారు. 
 
భర్త టాయిలెట్‌కు వెళ్లి వచ్చేలోగా.. వీరి కారును నలుగురు దుండుగులు చుట్టుముట్టారు. ఆ తర్వా కారులోని మహిళను బలవంతంగా దుండగులు బయటకు లాగారు. దాన్ని అడ్డుకోబోయిన భర్తను చితకబాది.. అతడి ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
విషయం పోలీసులకు చెప్తే చంపేస్తామని దుండగులు దంపతులను బెదిరించారు. మొత్తానికి బాధితురాలి భర్త.. నిందితుల కారు నెంబర్‌ను నోట్ చేసుకోవడంతో వారిని పట్టుకునేందుకు మార్గం సులువైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్‌తో మాట్లాడితే తప్పేంటి? పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న