Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిక్షావాలాతో అఫైర్.. అడ్డొచ్చిన భర్తను చంపేసిన భార్య

విద్యావంతురాలైన ఓ మహిళ ఉద్యోగిని రిక్షావాలాతో శారీరక సంబంధం పెట్టుకుని, అడ్డొచ్చిన భర్తను కడతేర్చింది. ఈ దారుణం గుజరాత్‌ రాష్ట్రంలోని వల్సాడ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈవివరాలను పరిశీలిస్త

రిక్షావాలాతో అఫైర్.. అడ్డొచ్చిన భర్తను చంపేసిన భార్య
, మంగళవారం, 23 జనవరి 2018 (09:01 IST)
విద్యావంతురాలైన ఓ మహిళ ఉద్యోగిని రిక్షావాలాతో శారీరక సంబంధం పెట్టుకుని, అడ్డొచ్చిన భర్తను కడతేర్చింది. ఈ దారుణం గుజరాత్‌ రాష్ట్రంలోని వల్సాడ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈవివరాలను పరిశీలిస్తే, 
 
ఫల్ఘరా గ్రామంలో జయసుఖ్ రామా ఘోడియాపటేల్ అనే వ్యక్తికి భార్య శోభన, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శోభన ప్రతీరోజూ అజిత్ అనే వ్యక్తి రిక్షాలో కూర్చుని ఉద్యోగానికి వెళుతుంటుంది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం జయసుఖ్‌కు తెలిసింది. 
 
దీంతో భార్యాభర్తల మనస్పర్థలు తలెత్తాయి. తర్వాత శోభనతోపాటు భర్త కూడా ఆదే రిక్షాలో ఆఫీసుకు రాకపోకలు సాగించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో సోమవారం భార్యాభర్తలిద్దరూ అదే రిక్షాలో కూర్చున్నారు. దారిలో నిర్మానుష్య ప్రదేశం రాగానే శోభన ఆమె ప్రేమికుడైన రిక్షావాలాలు కలిసి జయసుఖ్‌పై మారణాయుధంతో దాడిచేసిన చంపేశారు. 
 
మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి ఇరువురూ పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానికులు హత్యా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి భార్య శోభనను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న రిక్షావాలా కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వృద్ధుడు రాజకీయాల్లో ఏం ఇరగదీస్తాడూ... రజినీపై ఫైర్ అయిన డైరెక్టర్