Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.30లకు లాటరీ కొంటే.. కోటి రూపాయలు తగిలింది...

Advertiesment
West Bengal
, గురువారం, 21 ఏప్రియల్ 2022 (22:16 IST)
అదృష్టమంటే అతడిదే. ముప్పై రూపాయలు పెట్టి ఓ లాటరీ టికెట్ కొన్న అతనికి కోటి రూపాయలు తగిలింది. అయితే ముందు ఈ విషయాన్ని అతడు నమ్మలేదు. అంతే నేరుగా లాటరీ టికెట్‌తో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కల్పించాలని కోరాడు. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌కి చెందిన మహబూబ్ రూ.30 పెట్టి ఓ లాటరీ టికెట్ కొంటే ఏకంగా కోటి రూపాయలు తగలడంతో రాత్రికి రాత్రే అతని లైఫ్ మొత్తం మారిపోయింది. షేర్‌క్రాపర్‌గా పనిచేస్తున్న మహబూబ్‌కి డబ్బులు గెలుచుకోవాలన్నఅసక్తితో లాటరీ టికెట్లు కొనేవాడు. ఈ అలవాటుతో అతను కోటీశ్వరుడు అయ్యాడు.
 
తాను గెలిచిన భారీ మొత్తంతో ఏమి చేయాలనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మహబూబ్ చెప్పుకొచ్చాడు. అయితే, తన భార్య, ముగ్గురు పిల్లల కోసం ఇల్లు నిర్మించడం.. పిల్లలకు మెరుగైన విద్య అందించాలనుకుంటున్నట్లు చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మానవత్వంతో వ్యవహరించిన సుప్రీం.. మరణశిక్షను అలా తగ్గించింది