Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Advertiesment
samosas and jalebis

సెల్వి

, సోమవారం, 14 జులై 2025 (18:51 IST)
samosas and jalebis
సమోసా జిలేబీలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ క్యాంటీన్లు, రెస్టారెంట్లలో సమోసాలు, జిలేబీలలో చక్కెర, కొవ్వు, నూనె పరిమాణం గురించి హెచ్చరించే ఆయిల్, షుగర్ బోర్డును ఏర్పాటు చేయాలనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 
 
ఇలా చేస్తే పెరుగుతున్న ఊబకాయుల సంఖ్యను తగ్గించుకోవచ్చునని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒబిసిటీని  అరికట్టడానికి, ఫిట్ ఇండియా పెంచడానికి కీలక అడుగు అని ఆరోగ్య నిపుణులు చెప్పారు. సిగరెట్ ప్యాకెట్లపై పొగాకు హెచ్చరికల మాదిరిగానే "నూనె- చక్కెర బోర్డులను" ఏర్పాటు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర సంస్థలను ఆదేశించింది. 
 
సమోసాలు, కచోరి, పిజ్జా, పకోరాలు, అరటిపండు చిప్స్, బర్గర్లు, శీతల పానీయాలు, చాక్లెట్ పేస్ట్రీలు వంటి ప్రసిద్ధ ఆహార పదార్థాలలో చక్కెర, నూనె పరిమాణం హానికరమైన ప్రభావాలను సమాచార పోస్టర్లు, డిజిటల్ బోర్డులు హైలైట్ చేయాలని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇది మానవ శరీరంపై ఈ ఆహారాల ప్రభావాలను కూడా ప్రదర్శిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?