Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకా కార్యక్రమం ప్రారంభించిన వేదాంత

ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకా కార్యక్రమం ప్రారంభించిన వేదాంత
, సోమవారం, 31 మే 2021 (17:31 IST)
తమ ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సుకు భరోసానందిస్తూ వేదాంత ఇప్పుడు మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను దేశ వ్యాప్తంగా ఆరంభించింది. తద్వారా తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాములకు టీకాలను అందించనున్నారు.
 
ఈ కంపెనీ 50 వేల మోతాదుల టీకాలను అందుకోవడంతో పాటుగా వాటిని ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు పలు యూనిట్ల వద్ద వేయడం జరిగింది. వేదాంత ఇప్పుడు అదనంగా మరో 2 లక్షల టీకా మోతాదులను సమీకరించుకోవడంతో పాటుగా టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 1.2 లక్షల మందికి టీకాలను వేయనున్నారు.
 
వేదాంత ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ, ‘‘వేదాంతలో ప్రతి ఉద్యోగి భద్రత, శ్రేయస్సుతో పాటుగా వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి కూడా తాము అమిత ప్రాధాన్యతనిస్తుంటాం. మా టీకా కార్యక్రమం ద్వారా 100% ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు టీకా వేశామనే భరోసా అందించాలనుకుంటున్నాం. దేశంలో జరుగుతున్న టీకా కార్యక్రమానికి తమ వంతు తోడ్పాటునందించడానికి కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు.
 
ఇదే సమయంలో తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మరింత భద్రతను అందిస్తూ అత్యుత్తమ శ్రేణి టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని సైతం సంస్థ అందిస్తుంది. ఈ పాలసీ ద్వారా ఐదు సంవత్సరాల వార్షిక జీతానికి ఐదు రెట్ల కవరేజీని ఉద్యోగులకు అందిస్తారు. దీనితో పాటుగా ఆరోగ్య బీమా కవరేజీని సైతం 1.5 రెట్లు వృద్ధి చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 10 వేదాంత కేర్స్‌ ఫీల్డ్‌ ఆస్పత్రులను కోవిడ్‌ రోగుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణా రాష్ట్రంలో మారిన బ్యాంకు పనివేళలు