Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నర్సు నిర్లక్ష్యం.. చేతినుంచి జారిపడిన శిశువు మృతి..

baby boy
, గురువారం, 28 ఏప్రియల్ 2022 (10:05 IST)
లక్నోలో దారుణం చోటుచేసుకుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అప్పుడే జన్మించిన శిశువు మృతి చెందింది. 
 
ఇలా నర్సు నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన శిశువు మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. మృతశిశువు జన్మించాడంటూ వైద్యులు బుకాయించే యత్నం చేశారు. వివరాల్లోకి వెళితే.. చింతన్‌ ప్రాంతానికి చెందిన మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది.
 
అయితే టవల్‌తో జాగ్రత్తగా ఎత్తుకోవాల్సిన శిశువును నర్సు నిర్లక్ష్యంగా ఒంటిచేత్తో పైకి లేపింది. దీంతో శిశువు జారి కిందపడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలి మృతిచెందాడు. ఇది చూసిన తల్లి ఆర్తనాదాలు పెట్టడంతో భయాందోళనకు గురైన కుటుంబీకులు డెలివరీ రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆసుపత్రి సిబ్బంది వారిని అడ్డుకునేందుకు యత్నించారు.
 
మృత శిశువు జన్మించిందంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే శిశువు ఆరోగ్యంగానే పుట్టాడని, నర్సు తప్పిదం కారణంగానే కిందపడి మృతిచెందినట్లు సదరు తల్లి చెప్పింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం రిపోర్టులో తలకు గాయం కారణంగానే శిశువు మరణించినట్లు వెల్లడైంది. దీంతో ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాంధీ ఆస్పత్రిలో దారుణం.. వెన్నుపూస ఆపరేషన్ కోసం 25 రోజులు.. బోల్ట్స్ లేవని?