Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాంధీ ఆస్పత్రిలో దారుణం.. వెన్నుపూస ఆపరేషన్ కోసం 25 రోజులు.. బోల్ట్స్ లేవని?

Advertiesment
operation
, గురువారం, 28 ఏప్రియల్ 2022 (09:51 IST)
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు తీరు మరోసారి వివాదాస్పదం అవుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ బాలికకు ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

ఆపరేషన్ థియేటర్ వరకు తీసుకెళ్లిన డాక్టర్లు.. బోల్ట్స్ లేవంటూ వెనక్కి పంపేశారు. దీంతో గత 25 రోజులుగా ఇటు కూర్చోలేక, అటు నిల్చోలేక బాధితురాలు నరకయాతన అనుభవిస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గరు మృతి చెందారు. ఇద్దరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్షయ అనే వతి మాత్రం హైదరాబాద్ గాంధీలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. 
 
త్వరలో తాను కోలుకుంటానని ఆశతో ఎదురుచూస్తున్నప్పటికీ.. వెన్నుపూస ఆపరేషన్ చేయకుండా 25 రోజులుగా గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో తనకు నయం కాక.. అటు తమ బంధువులు బతికున్నారో లేదో తెలియని స్థితిలో ఈ యుతి అనుభవిస్తున్న నరకయాతన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు నల్గొండ జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్