Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పద్మశ్రీ పురస్కారం అందున్న తొలి ట్రాన్స్‌జెండర్ - రాష్ట్రపతికి పైట కొంగుతో దిష్టితీసి...

పద్మశ్రీ పురస్కారం అందున్న తొలి ట్రాన్స్‌జెండర్ - రాష్ట్రపతికి పైట కొంగుతో దిష్టితీసి...
, బుధవారం, 10 నవంబరు 2021 (13:55 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే పద్మ పురస్కారాలను 2021 సంవత్సరానికి మంగళవారం ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ పురస్కారాలు అందుకున్న వారిలో ట్రాన్స్‌జెండ‌ర్‌, జాన‌ప‌ద నృత్యకారిణి మాతా బీ మంజ‌మ్మ జోగ‌తి కూడా ఉన్నారు. ఈమె పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. 
 
క‌ర్ణాట‌క జాన‌ప‌ద అకాడ‌మీకి అధ్యక్షురాలిగా ప‌నిచేసిన తొలి ట్రాన్స్‌విమెన్‌గా మంజ‌మ్మ జోగ‌తి గుర్తింపు పొందారు. అవార్డు అందుకునే స‌మ‌యంలో మంజ‌మ్మ జోగ‌తి రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను త‌న‌దైన రీతిలో ఆశీర్వదించారు. తన పైట కొంగుతో మూడుసార్లు రాష్ట్రపతికి దిష్టితీసి, ఆ తర్వాత పాదాబివందనం చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా రాష్ట్రప‌తి, మంజ‌మ్మ జోగ‌తి న‌వ్వుతూ ఏదో మాట్లాడుకోవ‌టం క‌నిపించింది. మంజ‌మ్మ జోగతి హావ‌భావాలకు ముగ్ధులై అక్కడున్న వారంతా చిరున‌వ్వులు చిందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్కారు ఆస్పత్రిలోనే పండంటి బాబుకు జన్మనిచ్చిన కలెక్టర్