Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్సవాలు.. అలిసిపోయారు.. రైల్వే ట్రాక్‌పై నిద్రపోయారు.. అంతే..?

railway track
, మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (13:59 IST)
తమిళనాడు తిరువారూర్‌లో రైలు పట్టాలపై నిద్రిస్తున్న ముగ్గురు యువకులను రైలు ఢీకొని మృతి చెందడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తిరువారూర్ జిల్లాలోని ముత్తుపేటైలో ఓ అమ్మవారి ఆలయం ఉంది. ప్రస్తుతం ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతుండటంతో ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
 
ఈ ఉత్సవాలకు హాజరైన ముగ్గురు యువకులు రాత్రి అలసట కారణంగా రైల్వే ట్రాక్‌పై నిద్రించారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 3:30 గంటలకు తాంబరం నుంచి సెంగోట్లైకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ట్రాక్‌పై నిద్రిస్తున్న యువకులపైకి దూసుకెళ్లడంతో ఆ ముగ్గురు మృతి చెందారు.
 
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రైలు ఢీకొన్న ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పండుగకు వచ్చిన ముగ్గురు యువకులు పట్టాలపై పడుకుని రైలు ఢీకొని మృతి చెందడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండోనేషియాలో భారీ భూకంపం - తీవ్రత 7.3గా నమోదు