Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరాఠీలను వణికిస్తున్న గిలియన్ బార్ సిండ్రోమ్

Advertiesment
gbs

ఠాగూర్

, ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (19:26 IST)
మహారాష్ట్రలో ప్రజలను గిలియన్ బార్ సిండ్రోమ్ (జీబీఎస్) వణికిస్తుంది. జీబీఎస్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నయి. ఈ సిండ్రోమ్ శరవేగంగా వ్యాపిస్తుంది. దీనికి కారణమే శనివారం కొత్తగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో జీబీఎస్ కేసుల సంఖ్య మొత్తం 183కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 151 మంది కోలుకోగా, ఆరుగురు మరణించారు. ఇటీవల ముంబైలో 64 యేళ్ల వృద్ధురాలికి జీబీఎస్ వ్యాధి ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఆ మహిళకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా నీటి శాంపిల్స్‌ను పరీక్షించడంతో శనివారం మరో రెండు నీటి వనరులు కలుషితమైనట్టు తెలిపింది. 
 
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో జీబీఎస్ కేసులు నమోదవుతున్న విషయం తెల్సిందే. దీంతో ఈ సిండ్రోమ్ ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు స్థానికులకు ఆందోళనకు గురిచేస్తుంది. 
 
ఈ సిండ్రోమ్ సోకిన వారికి ఒళ్ళంతా తిమ్మిరిగా అనిపిస్తుంది. కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు రావడం వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. 
 
కలుషిత ఆహారం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, జీబీఎస్ అంటువ్యాధి కాదని చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు