Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తబ్లిగీ జమాత్ వ్యవహారంపై సీబీ'ఐ' అవసరం లేదు: కేంద్రం

తబ్లిగీ జమాత్ వ్యవహారంపై సీబీ'ఐ' అవసరం లేదు: కేంద్రం
, శుక్రవారం, 5 జూన్ 2020 (20:14 IST)
తబ్లిగీ జమాత్ పై ఇన్నాళ్లూ రకరకా ఆరోపణలు చేసిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు తమ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

తబ్లిగీ జమాత్ వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలు, ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్య వైఖరే కారణమని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణలో భాగంగా కేంద్రం ఇవాళ అఫిడవిట్ సమర్పించింది. తబ్లిగీ జమాత్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు అవసరంలేదని ఆ అఫిడవిట్ లో పేర్కొంది. ఇందులో ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్యం ఉందని తాము భావించడం లేదని స్పష్టం చేసింది. 
 
చట్టాన్ని అనుసరించి, రోజువారీ విధానంలో దర్యాప్తు జరుగుతోందని, నిజాముద్దీన్ మర్కజ్ కు సంబంధించిన ఈ కేసులో ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు కీలక దశలో ఉందని కేంద్రం వివరించింది.

నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ దర్యాప్తు పూర్తవుతుందని భావిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ జోక్యం అవసరంలేదని అనుకుంటున్నామని అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామ‌, వార్డు స‌చివాలయాల ద్వారా ‌ఇసుక బుకింగ్‌: జగన్