Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విధ్వంస సిద్ధాంతాలను చూసి ప్రపంచం భయపడుతోంది: మోడీ

విధ్వంస సిద్ధాంతాలను చూసి ప్రపంచం భయపడుతోంది: మోడీ
, శుక్రవారం, 20 ఆగస్టు 2021 (21:59 IST)
విధ్వంసకర సిద్ధాంతాలను చూసి ప్రపంచం భయపడుతోందని, ఉగ్రవాద శక్తులు తాత్కాలికంగా ఆధిపత్యం చెలాయించొచ్చేమో కానీ శాశ్వతంగా కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్‌ ఆలయానికి చెందిన పలు ప్రాజెక్టులను మోడీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విధ్వంసం కోసం ప్రయత్నించే శక్తులు, ఉగ్రవాదం ద్వారా సామాజ్య్రాలను సృష్టించే సిద్ధాంతాలను అనుసరించే వారి ఉనికి శాశ్వతం కాదని, వారు మానవత్వాన్ని ఎక్కువ కాలం అణచివేయలేరని స్పష్టం చేశారు.

ఇటువంటి సమయంలో ఈ సోమనాథ్‌ దేవాలయం ప్రపంచానికి ఉత్తమమైన ఉదాహరణ అని, భరోసాగా ఉంటుందని అన్నారు. గతంలో అనేకసార్లు ఆలయాన్ని ధ్వంసం చేసి దోచుకున్నా, నేడు నూతనంగా ఆధునీకరించబడిందని పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌ను ఇటీవల తాలిబన్లు వశపరుచుకున్న నేపథ్యంలో మోడీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశంలో మతపరమైన పర్యాటకాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజీవ్ గాంధీ కృషి వల్లనే 18 ఏళ్లకు ఓటు హక్కు : రేవంత్ రెడ్డి