Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లష్కర్ కమాండర్ అబ్రార్‌ను హతమార్చిన భారత్ భద్రతా బలగాలు

లష్కర్ కమాండర్ అబ్రార్‌ను హతమార్చిన భారత్ భద్రతా బలగాలు
, మంగళవారం, 29 జూన్ 2021 (08:25 IST)
పాకిస్థాన్‌కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా అగ్ర కమాండర్ అబ్రార్‌ను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. శ్రీనగర్ సమీపంలోని మాలోరా పరింపోరాలో జరిగిన ఎన్‌కౌంటరులో అబ్రార్‌ను చంపేశాయి. 
 
ఈ ఎన్‌కౌంటర్‌పై ఐజీపీ విజయ్ కుమార్ స్పందిస్తూ విచారణలో భాగంగా, అబ్రార్‌ను అదుపులోకి తీసుకున్న జవాన్లు సోమవారం రాత్రి అతను ఏకే-47 రైఫిల్‌ను దాచిన ఇంటికి తీసుకుని వెళ్లారు. ఆయుధాన్ని రికవరీ చేస్తున్న క్రమంలో అబ్రార్ అనుచరుడు తిరగబడి, జవాన్లపై కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ అనివార్యమైందని వివరించారు. 
 
ఆ ఇంట్లో ఉన్న ఓ విదేశీ ఉగ్రవాది జవాన్లను చూసి, లోపలి నుంచి కాల్పులు ప్రారంభించాడని, అబ్రార్ కూడా తిరగబడ్డాడని, ఆపై జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరూ మరణించారని, ఆ ఇంటి నుంచి అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని విజయ్ కుమార్ వెల్లడించారు.
 
విదేశీ ఉగ్రవాది కాల్పులు ప్రారంభించిన అనంతరం ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు అయ్యాయని, ఆ వెంటనే రాష్ట్ర పోలీసులతో పాటు అదనపు బలగాలను రప్పించి, ఇంటిని చుట్టుముట్టామని అన్నారు. 
 
గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలించామని తెలిపారు. హతులైన ఇద్దరు ఉగ్రవాదులూ, గతంలో ఎన్నో దాడులు చేశారని అన్నారు. శ్రీనగర్ హైవేపై జరిగిన బాంబు దాడిలోనూ వీరి ప్రమేయం ఉందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ కాంగ్రెస్‌ లో కొత్త ఉత్సహం