Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్త వేధింపులకు టెక్కీ ఆత్మహత్య... పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలని?

suicide

సెల్వి

, శుక్రవారం, 5 జులై 2024 (14:56 IST)
భర్త వేధింపులకు ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడింది. వరకట్న వేధింపులతో విసిగిపోయిన ఓ టెకీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగరం జిల్లా పులహడగలిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బసాపూర ప్రాంతానికి చెందిన సునీల్‌తో పూజకు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు ఎంబీఏ గ్రాడ్యుయేట్స్. పూజ ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ గంగమ్మ గుడి సమీపంలో ఓ ఇంట్లో నివసిస్తున్నారు. 
 
కానీ పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురావాలంటూ హింసిస్తున్నాడు. అయితే అతడి హింసను భరించలేక ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో పూజ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
బయటకు వెళ్లిన భర్త ఇంటికి వచ్చి చూడగా ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించింది. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తతో విబేధాల కారణంగా తన కూతురు బలవన్మరణానికి పాల్పడిందని కంప్లయింట్‌లో పేర్కొన్నారు. 
 
పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలని హింసించడంతోనే ఆమె చనిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అల్లుడు సునీల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీట్‌ పీజీ పరీక్ష షెడ్యూల్‌ విడుదల - రెండు షిఫ్టుల్లో నిర్వహణ