Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తల్లి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనీ...

తల్లి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనీ...
, బుధవారం, 10 ఏప్రియల్ 2019 (09:09 IST)
తల్లి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనీ కన్నబిడ్డ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విలుపురం జిల్లా చిన్నసేలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిన్న సేలం సమీపానగల నైనార్‌పాళయం గ్రామానికి చెందిన కవితాదేవి (41) అనే మహిళ భర్త వెంకటేశన్ ఎనిమిదేళ్ళ క్రితం చనిపోయాడు. దీంతో కవితాదేవి తన 16 యేళ్ళ కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో కవితాదేవి అదే ప్రాంతానికి చెందిన గ్రామ సహాయకుడు రాజేంద్రన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ప్లస్ వన్ చదువుతున్న కుమార్తె భాగ్యలక్ష్మి కనిపెట్టి తల్లితో పాటు రాజేంద్రన్‌ను నిలదీసింది. 
 
దీంతో ఆగ్రహోద్రుక్తుడైన రాజేంద్రన్ భాగ్యలక్ష్మిని చెప్పుతో కొట్టాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థిని భాగ్యలక్ష్మి శనివారం ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కీళకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి కవితాదేవి, రాజేంద్రన్‌లను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. తల్లి వివాహేతర సంబంధం కారణంగా కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో శోకాన్ని నింపింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో సిజేరియన్ ప్రసవాలు పెరగడానికి కారణాలేంటి?