Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భాగ్యరాజ్ దంపతులకు కరోనా పాజిటివ్..

భాగ్యరాజ్ దంపతులకు కరోనా పాజిటివ్..
, శనివారం, 8 మే 2021 (11:39 IST)
Bhagyaraj
తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే సోమవారం నుంచి కొత్త సర్కారు లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్‌ దంపతులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన తనయుడు శాంతను భాగ్యరాజ్‌ తెలియజేశారు. 
 
''నా తల్లితండ్రులు కె. భాగ్యరాజ్‌, పూర్ణిమా భాగ్యరాజ్‌కు ఈ రోజు కొవిడ్‌19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు... మా కుటుంబంతో సహా వ్యక్తిగత సిబ్బంది సైతం క్వారంటైన్‌లోకి వెళ్లాం. గత పది రోజుల్లో మమ్మల్ని కలిసిన వారందరూ కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకోండి'' అని శాంతను ట్వీట్‌ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Corona second wave: ఒక్కరోజే 4187 మంది మృతి