Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముందుగానే నైరుతి రుతుపవనాలు.. మే 31న కేరళను తాకనున్నాయ్!

ముందుగానే నైరుతి రుతుపవనాలు.. మే 31న కేరళను తాకనున్నాయ్!
, శుక్రవారం, 28 మే 2021 (12:42 IST)
నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరిస్తున్నాయి. పలకరిస్తున్నాయి. గత వారమే దక్షిణ అండమాన్‌ సముద్రంలో పూర్తిగా, దక్షిణ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్‌ సముద్రంలో పలు ప్రాంతాల్లో ప్రవేశించిన రుతుపవనాలు.. ఒకరోజు ముందే కేరళ తీరాన్ని తాకనున్నాయి. 
 
సాధారణంగా మే 22న రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి వస్తాయి. ఈ ఏడాది ఒకరోజు ముందుగానే రావడంతో కేరళకు కూడా ఒకరోజు ముందే చేరుకుంటున్నాయి. రుతుపవనాల ఆగమనానికి అనుకూల వాతావరణం ఏర్పడడం మంచి పరిణామంగా చెప్పుకోవాలి.
 
ఒకరోజు ముందే నైరుతి రుతుపవనాల రాకతో అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో గత వారమే వర్షాలు ప్రారంభమవగా.. ఈ ఏడాది వర్షపాతం సాధారణంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. 
 
బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా ముందుకు వస్తుండగా ఈ నెల 31న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రుతుపవనాల రాకతో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాల్ సెంటర్ ఉద్యోగినులే టార్గెట్.. వ్యభిచార కూపంలో అలా దించేస్తారు..