Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీలో ఘోరం... ఒకే ఫ్యామిలీలో ఆరుగురి సజీవదహనం

fire accident
, గురువారం, 15 జూన్ 2023 (18:24 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కుశినగర్ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో నిద్రపోతున్న ఆరుగురు కుటుంబ సభ్యులు సజీవదహనమయ్యారు. మృతుల్లో తల్లితోపాటు ఐదుగురు చిన్నారులు ఉన్నారు. పిల్లలంతా పదేళ్ల లోపువారే. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగినట్లు తాజాగా పోలీసులు వెల్లడించారు. 
 
జిల్లాలోని ఉర్ధా ప్రాంతంలో సంగీత (38) తన పిల్లలతో ఇంట్లో నిద్రిస్తుండగా.. ఆమె భర్త, అత్తమామలు ఇంటిబయట నిద్రిస్తున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ జరిగి గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయింది. క్షణాల్లోనే ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. ఇంతలో.. లోపల ఉన్న వారి అరుపులు విన్న భర్త, అత్తమామలు స్థానికులతో కలిసి వారిని కాపాడే ప్రయత్నం చేసినా మంటల తీవ్రత అధికంగా ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయారు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి లోపల ఉన్న వారిని బయటకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే వారు మృతి చెందారు. మృతులను సంగీత, బాబు(1), గీత(2), రీత(3), లక్ష్మిణ(9), అంకిత్‌(10)గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితకుటుంబాన్ని అన్నిరకాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.24 లక్షల ఆర్థికసాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో మృతదేహాల అవయవాలతో వ్యాపారం...