Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుబాయ్‌కి వెళ్లిన శివసేన ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి

MLA
, గురువారం, 12 మే 2022 (17:21 IST)
MLA
కుటుంబంతో విహార యాత్ర కోసం దుబాయ్‌కి వెళ్లిన ముంబైకి చెందిన ఓ శివసేన ఎమ్మెల్యే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ పర్యటనకు వెళ్లిన శివసేన ఎమ్మెల్యే రమేశ్ లక్టే అక్కడ గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది.
 
ఆయన వయసు 52 ఏళ్లు. ఎమ్మెల్యే రమేశ్ భౌతికదేహాన్ని గురువారం ముంబై తీసుకొచ్చే అవకాశం ఉంది. కాగా.. ముంబైలోని అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే కావడానికి ముందు ఆయన బీఎంసీ కార్పొరేటర్‌గా కూడా చేశారు. 
 
కాంగ్రెస్‌కు చెందిన సురేష్ శెట్టిని ఓడించి, 2014లో అంధేరీ ఈస్ట్ నుంచి మహారాష్ట్ర శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. 2019లో స్వతంత్ర అభ్యర్థి ఎం పటేల్‌ను ఓడించారు. కాగా, ఎమ్మెల్యే రమేశ్ మృతి పట్ల శివసేన నేతలు నివాళి అర్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కుప్పకూలిన వధువు...