Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహాత్మాగాంధీకి అత్యున్నత పౌర పురస్కారం.. ఈ అవార్డు పొందనున్న మొదటి వ్యక్తి..?

మహాత్మాగాంధీకి అత్యున్నత పౌర పురస్కారం.. ఈ అవార్డు పొందనున్న మొదటి వ్యక్తి..?
, శనివారం, 14 ఆగస్టు 2021 (17:39 IST)
జాతిపిత మహాత్మా గాంధీకి అరుదైన అత్యున్నత పౌర సత్కారం లభించింది. మహాత్మా గాంధీని ప్రతిష్ఠాత్మక కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ పురస్కారంతో గౌరవించుకోవాలని అమెరికా ప్రతినిధులు తీర్మానించారు. 
 
న్యూయార్క్​ ప్రజాప్రతినిధి కరోలిన్ ఈ ప్రతిపాదనను సభ ముందు ఉంచగా సభ్యులు ఆమోదం తెలిపారు. కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్‌ను అమెరికాలోనే అత్యున్నత పౌర పురస్కారంగా పరిగణిస్తారు.

నెల్సన్ మండేలా, ఆంగ్‌సాంగ్‌ సూకీ సహా పలువురికి ఈ మెడల్ అందించారు. అయితే, మరణానంతరం ఈ పురస్కారం పొందనున్న మొదటి వ్యక్తి మహాత్మా గాంధీ కానున్నారు.
 
మహాత్మా గాంధీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమం, ఆయన చూపిన అహింస మార్గాలు.. దేశానికి, ప్రపంచానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు అమెరికా ప్రజాప్రతినిధులు. ఇతరులకు సేవ చేయడం కోసం సర్వస్వాన్ని ఇచ్చేయడం అనే దానికి గాంధీ ఓ ఉదాహరణ అని కొనియాడారు. 
 
ప్రపంచానికి శాంతి, అహింస మార్గాలు చూపి.. మానవాళికి ప్రేరణగా నిలిచిన గాంధీకి ఈ పురస్కారాన్ని ఇవ్వాలని చట్టసభ్యురాలు కరోలిన్ కోరారు. దీంతో కాంగ్రెషనల్ గోల్డ్​ మెడల్‌తో గాంధీని గౌరవించుకోవాలని ప్రతినిధుల సభ మరోసారి తీర్మానించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమించాడు.. నిశ్చితార్థం చేసుకున్నాడు.. పెళ్లి పేరుతో లోబరుచుకుని..?