Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కడుపులో ఇన్ఫెక్షన్ - ఢిల్లీ ఆస్పత్రిలో చేరిన భగవంత్ సింగ్

bhagwant mann
, గురువారం, 21 జులై 2022 (12:28 IST)
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఆస్పత్రిపాలయ్యారు. కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కడుపులో ఇన్ఫెక్షన్ అయినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. 
 
ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్నలు అందుకుంటున్నారు. అదేసమయంలో రాష్ట్రంలోని అరాచకశక్తులు, గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర పోలీసులను, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది గ్యాంగ్‌స్టర్లను ఏరివేస్తుంది. 
 
అమృత్‌సర్‌లోని  భక్నా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటరులో గ్యాంగ్‌స్టర్లు జగ్రూప్ సింగ్ రూప, మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మన్నాకుసా ప్రాణాలు కోల్పోయారు. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో వీరిద్దిర హస్తం వుందని అనుమానిస్తున్న తరుణంలో వారిద్దరూ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ కార్ల మార్కెట్‌లో మరో కొత్త రకం కారు