Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎడమ చేయి గుంజుతోందని చెప్పిన కేసీఆర్: హుటాహుటిన యశోద ఆస్పత్రిలో చేరిక

Advertiesment
ఎడమ చేయి గుంజుతోందని చెప్పిన కేసీఆర్: హుటాహుటిన యశోద ఆస్పత్రిలో చేరిక
, శుక్రవారం, 11 మార్చి 2022 (12:22 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయన్ని హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. గత రెండు రోజులుగా తన ఎడమ చేయి గుంజుతున్నట్లు అనిపిస్తోందని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఐతే దాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో యశోద ఆసుపత్రికి తరలించారు.

 
శుక్రవారం 11 గంటలకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే బిజీ షెడ్యూల్ కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన వాయిదా పడిందని సీఎంవో కార్యాలయం వెల్లడించింది. 

 
కాగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవంలో కేసీఆర్ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాల్సి వుంది. ఐతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంగా పర్యటనను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ నెల 28న యాదాద్రి దేవాలయం కుంభాభిషేకం జరుగనుంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ యాదాద్రి పర్యటన వాయిదా, ఎందుకంటే?