Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్పత్రిలో చేరిన నటుడు కమల్ హాసన్.. ఎందుకో తెలుసా?

ఆస్పత్రిలో చేరిన నటుడు కమల్ హాసన్.. ఎందుకో తెలుసా?
, సోమవారం, 17 జనవరి 2022 (15:28 IST)
సినీ నటుడు కమల్ హాసన్ మరోమారు ఆస్పత్రిలో చేరారు. చెన్నై పోరూరులో ఉన్న శ్రీరామచంద్ర మెడికల్ రీసెర్చ్ సెంటరులో ఆయన వైద్య పరీక్షల కోసం సోమవారం అడ్మిట్ అయ్యారు. రెగ్యులర్ పరీక్షల కోసమే ఆయనకు ఆస్పత్రికి వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పరీక్షలు జరిపిన తర్వాత ఆయన్ను ఇంటికి పంపించనున్నారు. 
 
కాగా, ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన కమల్ హాసన్‌కు కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. దీంతో దాదాపు పది రోజులకు పైగా ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత తమిళ బిగ్ బాస్ ఫైనల్‌కు హాజరయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా ఆయన 'బిగ్ బాస్' హౌస్‌కే వెళ్లడం కోవిడ్ ప్రొటోకాల్స్‌కు విరుద్ధమని పేర్కొంటూ ప్రభుత్వం ఆయనకు నోటీసులు జారీచేసింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన సోమవారం మరోమారు ఆస్పత్రికి వెళ్లారు. రెగ్యులర్ వైద్య పరీక్షల కోసం వెళ్లారు. అయితే, వైద్యులు మాత్రం దీనిపై ఓ క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. అంటే, ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్‌ను ఇంకా రిలీజ్ చేయకపోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారి భార్యలు నిజంగానే గ్రేట్.. భర్తలకు ఆ స్వేచ్ఛ ఇచ్చారు: చిన్మయి