Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రంగీలా ఊర్మిలను నీచంగా ట్రోల్ చేసిన నెటిజన్.. చివరికి ఏమయ్యాడు?

Advertiesment
రంగీలా ఊర్మిలను నీచంగా ట్రోల్ చేసిన నెటిజన్.. చివరికి ఏమయ్యాడు?
, బుధవారం, 29 మే 2019 (13:34 IST)
సోషల్ మీడియాలో రంగీలా హీరోయిన్ ఊర్మిలపై ట్రోల్ చేస్తున్న నెటిజన్ల సంఖ్య పెరిగిపోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర ముంబైలో బీజేకి చెందిన గోపాల్ శెట్టిపై కాంగ్రెస్ పార్టీ తరపున ఊర్మిళ బరిలో దిగింది. నటీమణి కావడంతో ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆమె భారీ ఓట్ల తేడాతో గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో పూణేకు చెందిన ధనంజయ్ (57) అనే వ్యక్తి ఊర్మిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విమర్శలు లైంగిక వేధింపుల స్థాయికి వెళ్లాయి. సోషల్ మీడియాలో ఊర్మిళపై నీచమైన పోస్టు చేశాడు.
 
ఈ పోస్టుపై ఊర్మిళకు మద్దతుగా పలువురు ధనంజయ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఊర్మిళకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంకా ధనంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధనంజయ్‌‌ను అరెస్ట్ చేసి అతని వద్ద విచారణ చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ను మరొక సందర్భంలో కలుస్తాను, ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేను: పవన్ కళ్యాణ్