Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోదసీలోకి పీఎస్ఎల్‌వీ సీ46.. కౌంట్‌డౌన్ ఆరంభం

రోదసీలోకి పీఎస్ఎల్‌వీ సీ46.. కౌంట్‌డౌన్ ఆరంభం
, మంగళవారం, 21 మే 2019 (13:24 IST)
ఇస్రో సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. తద్వారా మరో అద్భుత ఘట్టానికి తెరతీయనుంది. నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి PSLV-C46 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రక్రియ మొదలైంది.


మంగళవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ప్రారంభమైంది. 25 గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన తర్వాత బుధవారం ఉదయం ఐదున్నర గంటలకు PSLVని నింగిలోకి ప్రయోగించనున్నారు. 
 
615 కిలోల బరువున్న రీశాట్‌-2బీర్‌1 ఉపగ్రహాన్ని రాకెట్‌ అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. అయితే దీని కాలపరిమితి మాత్రం ఐదేళ్లు. PSLV-C46 ప్రయోగాన్ని ముందుగా బుధవారంనాడు ఉదయం 5 గంటల 27 నిమిషాలకు ప్రయోగించాలని నిర్ణయించినప్పటికీ ఆ సమయంలో అంతరిక్షంలో వ్యర్థాలు అడ్డువస్తాయని గుర్తించి 3 నిమిషాల ఆలస్యంగా ఐదున్నర గంటలకు ప్రయోగం చేపట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ప్రస్తుతం కౌంట్‌డౌన్ నిరాటంకంగా కొనసాగుతోంది.
 
ఇస్రో ఛైర్మన్ కె. శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని, PSLV-C46 నమూనాను శ్రీవారి పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. రేపు ఉదయం ఐదున్నర గంటలకు ప్రయోగం ఉంటుందని శివన్‌ చెప్పారు.

ఆ తదుపరి ప్రాజెక్ట్‌గా జులై 9 నుంచి 16 లోపు చంద్రయాన్‌-2 ప్రయోగించనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్‌ 6న చందమామపై ఇస్రో జెండా రెపరెపలాడుతుందని శివన్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మతోడు.. ఆంధ్రాలో ఒక్క సీటు రాదంటున్న బీజేపీ నేత