Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనశ్శాంతి లేదనీ స్వామీజీ సూసైడ్ .. ఎక్కడ?

సాధారణంగా మనశ్శాంతిలేని వారికి స్వాంతన కలిగించేవారు స్వామీజీలు. కానీ, అలాంటి స్వామీజీలకే మనశ్శాంతి కరువైతే? తాజాగా ఓ స్వామీజీ మనశ్శాంతి లేదన్న కారణంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మనశ్శాంతి లేదనీ స్వామీజీ సూసైడ్ .. ఎక్కడ?
, మంగళవారం, 9 జనవరి 2018 (11:35 IST)
సాధారణంగా మనశ్శాంతిలేని వారికి స్వాంతన కలిగించేవారు స్వామీజీలు. కానీ, అలాంటి స్వామీజీలకే మనశ్శాంతి కరువైతే? తాజాగా ఓ స్వామీజీ మనశ్శాంతి లేదన్న కారణంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని గదగ్ జిల్లా శిహట్టి తాలూకాలోని బాలేహోసూరులో ఉన్న దింగాలేశ్వర మఠంలో జరిగింది.
 
ఈ మఠంలో ఉండే మహాలింగ స్వామీజీ (38) మనశ్శాంతి దక్కలేదన్న కారణంతో ఆదివారం అర్థరాత్రి సమయంలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
 
ఈ విషయాన్ని సోమవారం ఉదయం ఆశ్రమానికి వచ్చిన కొంతమంది భక్తులు ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
 
తన మరణానికి ఎవరూ కారణం కాదని, గత కొంత కాలంగా తాను మనశ్శాంతిని కోల్పోయానని, ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు. పైగా, తనన భౌతికకాయాన్ని మఠంలోనే సమాధి చేయాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌‌పై వేలెత్తి చూపకండి: అమెరికాపై డ్రాగన్ కంట్రీ ఫైర్