Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లికి పెద్దలు అడ్డు.. కలిసి చనిపోదామంటే నో చెప్పింది.. చివరికి ఆ ప్రియుడు ఏం చేశాడంటే?

ప్రేయసి వివాహానికి నిరాకరించడంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు. మతాలు వేరు కావడంతో ప్రేయసి తల్లి ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రియురాలిన తీవ్ర కొట్టిన ప్రియుడు.. ఆమెను

పెళ్లికి పెద్దలు అడ్డు.. కలిసి చనిపోదామంటే నో చెప్పింది.. చివరికి ఆ ప్రియుడు ఏం చేశాడంటే?
, శుక్రవారం, 29 డిశెంబరు 2017 (11:10 IST)
ప్రేయసి వివాహానికి నిరాకరించడంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు. మతాలు వేరు కావడంతో ప్రేయసి తల్లి ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రియురాలిన తీవ్ర కొట్టిన ప్రియుడు.. ఆమెను హత్యచేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మధు (25) హైదరాబాద్‌లో పని చేస్తుంటాడు. ఇతడు స్వగ్రామంలోని ముస్కాన్‌ పేటకు చెందిన సుస్మిత (22)ను ఐదేళ్లుగా ప్రేమించాడు. సుస్మిత కూడా మధును ప్రేమించింది. కానీ ఇద్దరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. 
 
గురువారం నాడు సిద్ధిపేటలో ఓ వివాహం కోసం వచ్చిన మధు సుస్మితకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. ఆమె వచ్చింది. అప్పటికే తన వెంట కూల్ డ్రింక్, పురుగుల మందును తెచ్చిన మధు, చనిపోయి ఒకటవుదామని తెలిపాడు. కానీ సుస్మిత ఎంతమాత్రం అంగీకరించకపోవడంతో మధు ఉన్మాదిగా మారిపోయాడు. ఆమెను తీవ్రంగా కొట్టాడు. 
 
స్పృహ కోల్పోయిన ఆమె మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. ఆపై అక్కడే తాను కూడా ఉరేసుకున్నాడు. ఉరేసుకునే ముందు తాను చేసిన పనిని తన స్నేహితుడికి తెలిపాడు. ఈ విషయం తెలుసుకుని స్నేహితులు ఘటనా స్థలానికి వచ్చే లోపే మధు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మతం మారనన్న హిందూ యువతిపై ఘోరం: గ్యాంగ్ రేప్, హత్య.. చెట్ల పొదల్లో పడేసి?