Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా కుక్క చనిపోయింది, నేనూ చనిపోతున్నానంటూ యువతి ఆత్మహత్య

నా కుక్క చనిపోయింది, నేనూ చనిపోతున్నానంటూ యువతి ఆత్మహత్య
, గురువారం, 19 నవంబరు 2020 (19:59 IST)
తన పెంపుడు కుక్క చనిపోయిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను తీసుకున్న విషాద ఘటన ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం రాయ్‌గ‌ఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రాయ్‌గ‌ఢ్ జిల్లా గోర్ఖా ప్రాంతంలోని కొట్రా రోడ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఓ కాల‌నీలో 21 ఏళ్ల ప్రియాన్షుసింగ్ పీజీ చదువుతోంది. తనకు తన పెంపుడు కుక్క అంటే ఎంతో ఇష్టం. గత నాలుగేళ్లుగా ఈ కుక్కను ఆమె పెంచుతోంది. ఐతే కుక్కకు అనారోగ్యం కలుగడంతో అది చనిపోయింది.
 
ఆ కుక్క చనిపోగానే ప్రియాన్షు తీవ్ర మనస్తాపానికి గురై ఆవేదన చెందుతూ వుంది. కుక్క బుధవారం నాడు మృతి చెందగా అదే రాత్రి ఆ యువతి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన మృతదేహాన్ని దహనం చేయవద్దనీ, కుక్కను ఎక్కడ ఖననం చేసారో అక్కడే తనను కూడా ఖననం చేయాలని సూసైడ్ నోట్ రాసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌కు పదేళ్ల జైలు శిక్ష