Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోర్కె తీర్చలేదని ప్రియురాలితో ఎలుకల మందు తినిపించిన ప్రియుడు

కోర్కె తీర్చలేదని ప్రియురాలితో ఓ ప్రియుడు ఎలుకల మందు తినిపించాడు. అదీ కూడా పీకపై కత్తిపెట్టి బెదిరించిమరీ తినిపించాడు. ముంబై నగరంలోని కంజుమార్గ్ ప్రాంతంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, కంజుమార్గ్ ప్ర

కోర్కె తీర్చలేదని ప్రియురాలితో ఎలుకల మందు తినిపించిన ప్రియుడు
, మంగళవారం, 27 మార్చి 2018 (09:56 IST)
కోర్కె తీర్చలేదని ప్రియురాలితో ఓ ప్రియుడు ఎలుకల మందు తినిపించాడు. అదీ కూడా పీకపై కత్తిపెట్టి బెదిరించిమరీ తినిపించాడు. ముంబై నగరంలోని కంజుమార్గ్ ప్రాంతంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, కంజుమార్గ్ ప్రాంతానికి చెందిన కిషన్ సోనవానే (24) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ 22 ఏళ్ల యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ ఐదేళ్లుగా కలిసిమెలిసి తిరిగారు. హద్దులు కూడా దాటారు. అయితే, గత నెల రోజులుగా వీరిమధ్య మనస్పర్థలు పొడచూపాయి. ఫలితంగా కొంత దూరంగా ఉంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో తన ప్రియురాలిని చెంతకు చేరదీసి.. కోర్కె తీర్చమన్నాడు. దానికి ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ప్రియుడు... విఖ్రోలీలోని గార్డెన్‌కు రప్పించాడు. అనంతరం ఆమెకు ఎలుకల మందు బిళ్ల ఇచ్చి దాన్ని తినమని కత్తితో బెదిరించాడు. దీంతో ఆ యువతి దిక్కుతోచక ఎలుకల మందు తిని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. 
 
అంతే పార్కులో ఉన్న తోటి సందర్శకులు ఆమెను హుటాహుటిన మహాత్మాఫూలే మున్సిపల్ ఆసుపత్రికి తరలించారు. మాజీ ప్రేయసి ఆసుపత్రిలో కోలుకుంటుండగా, ప్రియుడు పారిపోయాడు. యువతి ఫిర్యాదు మేర పోలీసులు రంగంలోకి దిగి నిందితుడైన కిషన్ సోనవానేను అరెస్టు చేశారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో కిమ్ జాంగ్ పర్యటన: 2011లో తండ్రి జర్నీ చేసిన అదే తరహా రైలులోనే?