Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మామిడి తోటలో పరాయి వ్యక్తితో భార్య... కళ్లారా చూసిన భర్త ఏం చేశాంటే?

వివాహేతర సంబంధాలు మానవసంబంధాలకు మాయనిమచ్చగా మారుతున్నాయి. కట్టుకున్న భర్త ఉన్నప్పటికీ పరాయి పురుషుల సుఖానికి కొంమంది మహిళలు వెంపర్లాడుతున్నారు.

మామిడి తోటలో పరాయి వ్యక్తితో భార్య... కళ్లారా చూసిన భర్త ఏం చేశాంటే?
, శుక్రవారం, 16 మార్చి 2018 (14:27 IST)
వివాహేతర సంబంధాలు మానవసంబంధాలకు మాయనిమచ్చగా మారుతున్నాయి. కట్టుకున్న భర్త ఉన్నప్పటికీ పరాయి పురుషుల సుఖానికి కొంమంది మహిళలు వెంపర్లాడుతున్నారు. ఇవి అనేక నేరాలు, ఘోరాలకు దారితీస్తున్నాయి. తాజాగా, తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి గ్రామంలో ఓ వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది.
 
మామిడి తోటలో కట్టుకున్న భార్య పరాయి పురుషుడితో అభ్యంతరకర భంగిమలో ఉండటాన్ని చూసిన ఆ భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో భార్యతో పాటు.. అమెతో ఉన్న వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తూర్పుగోదావరి జిల్లా కొత్తి కొట్టాం గ్రామానికి చెందిన అడిగర్ల నూకరత్నం అనే మహిళకు దిగిశివాడకు చెందిన అప్పలనాయుడుతో పదేళ్ల క్రితం వివాహమైంది. భార్య తరచూ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. గురువారం అదే గ్రామానికి చెందిన పి.శ్రీనుతో జీడిమామిడి తోటలో అభ్యంతరకర భంగిమలో ఉండటాన్ని గమనించాడు. 
 
ఆ వెంటనే ఆగ్రహానికి గురైన అప్పలనాయుడు వారిపై కత్తితో దాడి చేశాడు. శ్రీను పారిపోగా నూకరత్నంకు మెడ, తలపై గాయాలయ్యాయి. స్థానికులు బంధువుల సహాయంతో తుని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పలనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగుదేశం తెగతెంపులు.. అవిశ్వాసానికి 8 పార్టీల మద్దతు... దీదీ హర్షం