Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్డీయే ఎంపీలకు జేపీ నడ్డా పసందైన విందు భోజనం... మెనూ ఇదే..!!

dinner

వరుణ్

, ఆదివారం, 9 జూన్ 2024 (17:41 IST)
నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఆదివారం రాత్రి కొలువుదీరనుంది. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత ఎన్డీయ భాగస్వామ్య పార్టీలకు చెందిన 294 మంది ఎంపీలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పసందైన డిన్నర్ పార్టీని ఏర్పాటుచేశారు. ఈ విందు భోజనంలో వడ్డించే వంటకాలకు సంబంధించిన మెనూ కూడా తాజాగా వెల్లడైంది. 
 
ఈ విందులో ఐదు రకాల పళ్ల రసాలను, వివిధ రుచుల్లో మిల్క్ షేక్‌లు, స్టఫ్డ్ లిచీ, మట్కా కుల్పీ, మ్యాంగో ఐస్‌క్రీమ్, మూడు ఫ్లేవర్లలో రైతాను వడ్డించనున్నారు. జోధ్ పురీ సబ్జి, పప్పు, దమ్ బిర్యానీ, ఐదు రకాల రొట్టెలు వడించనున్నారు. రుచికరమైన పంజాబీ వంటకాల కోసం ప్రత్యేకంగా ఓ ఫుడ్ కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తృణధాన్యాలను ఇష్టపడేవారికి కోసం కిచిడీ సిద్ధం చేస్తున్నారు. తీపి ఇష్టపడే వారి కోసం ఎనిమిది రకాల డిసర్ట్‌లు, రసమలై, నాలుగు వెరైటీల్లో ఘేవర్, స్పెషల్ టీ, కాఫీలను అందుబాటులో ఉంచుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేస్తాం : జి.కిషన్ రెడ్డి