Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీనగర్ రాజ్‌బాగ్‌‍ వాణిజ్య భవనంలో మంటలు

Advertiesment
Massive Fire Accident
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే రాజ్‌బాగ్‌లోని కమర్షియల్ కాంప్లెక్స్‌లో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పివేశాయి. 
 
ఈ కాంప్లెక్స్‌లో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక అధికారులు అధికారికంగా అంచనా వేశారు. ఈ క్రమంలో మంటలను అదుపు చేస్తుండగా, ఫైర్ ఇంజిన్ అధికారి ఒకరు గాయపడ్డారు. అయితే, ప్రాణనష్టం సంభవించకపోయినప్పటికీ... ఆస్తి నష్టం మాత్రం వాటిల్లింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్