Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పద్మావతి రచ్చ... ప్రధానమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రబ్రీదేవి

బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. పద్మావతి సినిమాలో నటించినందుకు ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే తలకు బీ

పద్మావతి రచ్చ... ప్రధానమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రబ్రీదేవి
, బుధవారం, 22 నవంబరు 2017 (15:51 IST)
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. పద్మావతి సినిమాలో నటించినందుకు ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే తలకు బీజేపీ నేత ఒకరు రూ.10 కోట్ల నజరానా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో బీజేపీ అధిష్టానం ఆ నేతలకు సమన్లు జారీ చేసింది.
 
ఈ నేపథ్యంలో, మంగళవారం జరిగిన ఆర్జేడీ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, బీహార్‌లో చాలామంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొంతు కోసేందుకు, ఆయన చేతులు నరికేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 
 
నరేంద్ర మోడీపై ఆరోపణలు చేసేవారి వేళ్ళు నరుకుతామని వాళ్ళు అంటున్నారని, అలా చేస్తే, ఊరికే కూర్చునేందుకు దేశంలో ఎవరూ సిద్ధంగా లేరన్నారు. బీహార్ జనం ఏమీ అనరా? మోడీ తల నరికేందుకు, ఆయన చేతిని ముక్కలు చేసేందుకు ఇక్కడ చాలా మంది ఉన్నారన్నారు. ఇందుకోసం తాము జైలుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు రాజకీయ వర్గాల్లో వివాదాస్పదమయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. వారికే పటీదార్ల మద్దతు : హార్దిక్ పటేల్