ఉత్తరప్రదేశ్ లక్ష్మీపూర్ ఖేరీలోని జుగ్నుపూర్ గ్రామంలో చిరుతపులి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఇటుక బట్టీ దగ్గర ఒక వ్యక్తి తన చేతులతో చిరుతపులితో పోరాడుతుండగా, గ్రామస్తులు చిరుతపులిపై రాళ్ళు, ఇటుకలు విసురుతున్నట్లు వుంది.
వివరాల్లోకి వెళితే.. మిహిలాల్ (35) అనే వ్యక్తిని బట్టీ చిమ్నీ లోపల దాక్కున్న చిరుతపులి అకస్మాత్తుగా దాడి చేసింది. చిరుతపులి కనిపించడంతో గ్రామస్తులు పరుగులు తీశారు. ఇంకా చిరుతపై రాళ్ళు, ఇటుకలు విసిరారు. తరువాత, అటవీ అధికారులు చిరుతను పట్టుకోవడానికి వచ్చారు.
చిరుత వారిపై దాడి చేసింది. ఈ క్రమంలో, ఒక అటవీ అధికారి, ఒక రేంజర్, ఒక కానిస్టేబుల్, ఒక గ్రామస్థుడిని గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు. అదనంగా, అటవీ బృందం చిరుతను శాంతింపజేసి పట్టుకోగలిగింది. ఈ వీడియో ఆన్లైన్లో చాలా మంది వీక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసింది.