Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ద‌క్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ మునిమ‌నవరాలికి జైలు శిక్ష

ద‌క్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ మునిమ‌నవరాలికి జైలు శిక్ష
, మంగళవారం, 8 జూన్ 2021 (13:10 IST)
ఓ ఫోర్జరీ కేసులో దోషిగా తేలిన మ‌హాత్మాగాంధీ మునిమ‌నవరాలు ఆశిష్ లతా రామ్‌గోబిన్(56)కు ద‌క్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఆశిష్ లతా రామ్‌గోబిన్... వ్యాపారవేత్త  ఎస్‌ఆర్ మ‌హ‌రాజ్‌ను మోసం చేసినట్లు తేలింది.

భార‌త్‌ నుంచి ఆమెకు  వచ్చే ఒక‌ కన్‌సైన్‌మెంట్‌కు కస్టమ్స్ డ్యూటీస్ చెల్లించేందుకు మహరాజ్ ఆమెకు అడ్వాన్స్ రూపంలో రూ.3.23 కోట్లు (62 లక్షల ర్యాండ్లు) ఇచ్చారు. అయితే ఆ కన్‌సైన్‌మెంట్ నుంచి వచ్చే లాభాల్లో కొంత మొత్తం ఆయనకు లభిస్తుంది.

అయితే అటువంటి కన్‌సైన్‌మెంట్ ఏదీ లేదంటూ కొన్ని నకిలీ బిల్లులు సృష్టించి, మ‌హ‌రాజ్‌ను ఆమె  మోసం చేశారని విచార‌ణ‌లో తేలింది. ఈకేసు విచార‌ణ 2015లోనే ప్రారంభ‌మ‌య్యింది. ఆమె ఈ ఉదంతంలో... లేని కన్‌సైన్‌మెంట్ ఉన్నట్లుగా చూపించేందుకు నకిలీ ఇన్వాయిస్‌లు, డాక్యుమెంట్లు త‌యారు చేశార‌ని తేలింది.

ఈ కేసులో అరెస్ట్ అయిన‌ ఆమె... 50 వేల‌ ర్యాండ్లు పూచీకత్తుగా చెల్లించి, బెయిల్‌పై విడుదలయ్యారు. 2015 ఆగస్టులో ఆశిష్ లతా... మహరాజ్‌ను కలిశారు. తాను సౌత్ ఆఫ్రికన్ హాస్పిటల్ గ్రూప్ నెట్ కేర్ కోసం మూడు కంటైనర్ల లైనెన్‌ను భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ఆమె మ‌హ‌రాజ్‌కు తెలిపారు.

అయితే ఇంపోర్ట్ డ్యూటీ చెల్లించేందుకు డ‌బ్బులు లేవ‌ని చెప్పి ఆమె మహరాజ్ నుంచి ఆర్ధిక సాయం పొందారు. ఆమె చూపించిన నకిలీ ఇన్వాయిస్ ఆధారంగా ఆమెకు మ‌హ‌రాజ్ డ‌బ్బులు ఇచ్చినట్లు తేలింది.

కాగా దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ ఎంతో మంది పేదలకు న్యాయ స‌హాయం చేశారు. అయితే ఇప్పుడు గాంధీ పేరును ఆమె దిగ‌జార్చేలా ప్ర‌వ‌ర్తించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెదిరించి, వ్యభిచార వృత్తిలోకి దించి..!