Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాల కోసం చిన్నారి ఏడుస్తుంటే.. ఆ తల్లి గొంతు కోసేసింది.. ఎక్కడ?

కన్నబిడ్డనే ఓ కిరాతక తల్లి పొట్టనబెట్టుకుంది. ఆకలితో పాల కోసం పసిపాప ఏడుస్తుంటే.. ఆ తల్లి కొంతుకోసేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ధ

పాల కోసం చిన్నారి ఏడుస్తుంటే.. ఆ తల్లి గొంతు కోసేసింది.. ఎక్కడ?
, శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (16:24 IST)
కన్నబిడ్డనే ఓ కిరాతక తల్లి పొట్టనబెట్టుకుంది. ఆకలితో పాల కోసం పసిపాప ఏడుస్తుంటే.. ఆ తల్లి కొంతుకోసేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ధర్ గ్రామంలో పాల కోసం గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న పాపను పట్టించుకోకుండా ఆ తల్లి వంట పనిచేసింది. అయితే పాప ఏడుపు ఆపకపోవడంతో వంట చేస్తున్న చిరాకుతో సహనం కోల్పోయి.. కత్తితో బిడ్డ గొంతు కోసేసింది. ఆపై బిడ్డ ఏడుపు ఆపేసింది. అప్పటికే జరగాల్సిందల్లా జరిగిపోయింది. 
 
కత్తి పడటంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇంటి నుంచి బంధువుల ఇంటికి పారిపోయిన సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బిడ్డను వదిలిపెట్టి తల్లి మాత్రం ఒంటరిగా పారిపోయి రావడాన్ని గమనించిన బంధువులు, స్థానికులు ఇంటిని తెరిచి చూస్తే రక్తపు మడుగులో వున్న చిన్నారిని చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్య బాబోయ్.. అమిత్ షా ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వలేదంటే నమ్మరే : వీర్రాజు