Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి మూత్రం తాగించారు..

ప్రేమించడం పాపమైంది. ఇంకా వారు ప్రేమ పెళ్లి చేసుకోవడం అంతకంటే పాపం చేసినట్లైంది. ప్రేమించిన కారణంగా ఓ దంపతులకు నరకం చూపించారు. దంపతులిద్దరిని కిడ్నాప్ చేసి.. దారుణంగా చితకబాది.. ఆ తర్వాత గుండు గీయించి

ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి మూత్రం తాగించారు..
, బుధవారం, 1 ఆగస్టు 2018 (12:35 IST)
ప్రేమించడం పాపమైంది. ఇంకా వారు ప్రేమ పెళ్లి చేసుకోవడం అంతకంటే పాపం చేసినట్లైంది. ప్రేమించిన కారణంగా ఓ దంపతులకు నరకం చూపించారు. దంపతులిద్దరిని కిడ్నాప్ చేసి.. దారుణంగా చితకబాది.. ఆ తర్వాత గుండు గీయించి.. మూత్రం తాగించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లాలోని హర్‌దాస్‌పూర్‌లో జులై 25న చోటుచేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. హర్‌దాస్‌పూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు, 21 ఏళ్ల యువతి గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఈ ఏడాది మే నెలలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు నెలల పాటు గుజరాత్‌లో ఉన్న ఈ నవ దంపతుల ఇంటికి యువకుడి మేనమామ వచ్చాడు. 
 
ఆ విషయం తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని దంపతులను జులై 25న కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నవదంపతులను తీవ్రంగా కొట్టి.. గుండు గీయించారు. అందరూ చూస్తుండగానే వీరిద్దరికి మూత్రం తాగించారు. అయితే ఈ దృశ్యాన్ని కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి.. వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. 
 
ఇక ధైర్యం చేసుకున్న బాధితులైన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు తన భార్య కుటుంబానికి రూ. 70 వేలు, రెండు మేకలను శిక్ష కింద ఇచ్చామని వరుడు చెప్పాడు. అయినా వేధింపులు కొనసాగుతూనే వున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెరైటీ జంట.. లింగ మార్పిడి చేయించుకుని పెళ్లి చేసుకున్నారు.. ఎక్కడ?