Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి రాత్రి నుంచి యూపీలో మళ్ళీ లాక్ డౌన్

నేటి రాత్రి నుంచి యూపీలో మళ్ళీ లాక్ డౌన్
, శుక్రవారం, 10 జులై 2020 (10:04 IST)
కొరకరాని కొయ్యలా మారిన కరోనా కోరల నుంచి ప్రజానీకాన్ని దూరంగా వుంచేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి జూలై 13వ తేదీ ఉదయం 5 గంటల వరకూ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో గురువారం 1,188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇది తక్కువే అయినప్పటికీ.. మరణాల రేటు అధికంగా వుండడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. యూపీలో గురువారం కరోనా వల్ల 18 మంది మరణించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే కథ ఎలా ముగిసిందంటే... వివరించిన పోలీస్ అధికారి...