Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ ప్రధానికి భారీ జరిమానా : షాకిచ్చిన బెంగుళూరు కోర్టు

మాజీ ప్రధానికి భారీ జరిమానా : షాకిచ్చిన బెంగుళూరు కోర్టు
, మంగళవారం, 22 జూన్ 2021 (18:11 IST)
మాజీ ప్రధానమంత్రి దేవెగౌడకు బెంగుళూరు కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఎప్పుడో పదేళ్ల క్రితం దేవెగౌడ చేసిన వ్యాఖ్యలకు పరువునష్టం దావా చెల్లించాలని బెంగళూరులోని ఎనిమిదో సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది.
 
తాజాగా వెలువడిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, బీదర్ సౌత్ మాజీ ఎమ్మెల్యే అశోక్ ఖేనీ మేనేజింగ్ డైరెక్టర్‌‍గా వ్యవహరిస్తున్న నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ప్రైజెస్ (నైస్) సంస్థ గురించి దేవెగౌడ విమర్శించారు. 
 
నైస్ ఒక దోపిడీ ప్రాజెక్టు అని వ్యాఖ్యానించారు. 2011 జూన్ నెలలో ఓ ఇంటర్వ్యూలో ఆయన సదరు సంస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. 'గౌడర గర్జనే' పేరుతో ఓ వార్తా ఛానల్ ఆ ఇంటర్వ్యూని ప్రసారం చేసింది.
 
ఈ వ్యాఖ్యలపై సదరు సంస్థలో పరువు నష్టం దావా వేసింది. దేవెగౌడ వ్యాఖ్యల వల్ల తమ సంస్థ పరువు నష్టం జరిగిందని కోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థాయం మంగళవారం తీర్పును వెలువరించింది. 
 
నైస్ సంస్థకు నష్ట పరిహారంగా రూ.2 కోట్లను చెల్లించాలని దేవెగౌడను ఆదేశించింది. పరువు నష్టం కలిగించే ఇలాంటి వ్యాఖ్యలను అనుమతించలేమని... వీటిని అనుమతిస్తే, భవిష్యత్తులో ఇలాంటి భారీ ప్రాజెక్టును అమలు చేయడం కష్టమవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇపుడు ఏం చేయాలో దేవెగౌడకు దిక్కుతోచడం లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాత్రూమ్‌లోకి వెళ్లి తల్లికి సీక్రెట్‌గా ఫోన్ చేసిన యువతి...