Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ.. "దాన్ని" కోసి టాయి‌లెట్‌ బేసిన్‌లో పడేసింది...

కట్టుకున్న భర్త తనను కాదనీ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని భార్య జీర్ణించుకోలేక పోయింది. దీంతో కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా దారుణమైన శిక్షను విధించింది.

వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ..
, బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (12:16 IST)
కట్టుకున్న భర్త తనను కాదనీ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని భార్య జీర్ణించుకోలేక పోయింది. దీంతో కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా దారుణమైన శిక్షను విధించింది. ఆ శిక్ష ఏంటో తెలుసా... భర్త అంగాన్ని నిలువునా చాకుతో కోసి దాన్ని టాయి‌లెట్‌ బేసిన్‌లో పడేసింది. ఈ దారుణం పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జలంధర్, జోగీందర్‌ నగర్‌కు చెందిన ఆజాద్‌ సింగ్‌ అనే వ్యక్తికి సుఖ్వంత్‌ కౌర్‌‌తో కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. ఆ తర్వాత వీరిమధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ కారణంగా ఆజాద్ సింగ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై భర్తను పలుమార్లు హెచ్చరించినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
దీంతో ఆగ్రహించిన కౌర్.. భర్త నిద్రపోతున్న సమయంలో రాడ్డుతో తలపై బలంగా మోది, ఆ తర్వాత కత్తితో అతని సున్నిత భాగాలను కోసేసి, టాయిలెట్‌ బేసిన్‌లో పారేసి నీళ్లు పోసింది. దీనిపై ఆజాద్ తండ్రి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా, ప్రస్తుతం ఆజాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీచర్నే కాదు.. ఆమె కుమార్తెని కూడా రేప్ చేస్తానన్నాడు- మరో విద్యార్థి ఏం చేశాడంటే..?