Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమృత జయలలిత కుమార్తెనా కాదా?: ఫిబ్రవరి 1న కోర్టులో విచారణ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ అమృత తెరపైకి వచ్చింది. గతంలో తాను జయలలిత కుమార్తెనని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు ఆ తర్వాత మ

అమృత జయలలిత కుమార్తెనా కాదా?: ఫిబ్రవరి 1న కోర్టులో విచారణ
, శుక్రవారం, 19 జనవరి 2018 (15:09 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ అమృత తెరపైకి వచ్చింది. గతంలో తాను జయలలిత కుమార్తెనని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు ఆ తర్వాత మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అమృత కేసు ఈ నెల 2న విచారణకు రానుంది. 
 
ఈ కేసులో డీఎన్ఏ ఒక్కటే కావడంతో అమృత హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)ని సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి సీసీఎంబీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సీసీఎంబీ కోర్టు ఆదేశాల మేరకే డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ కేసులో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలంటే.. అమ్మ అస్థికల డీఎన్ఏను సేకరించాలి. 
 
కానీ ఆ పని జరిగేలా కనిపించట్లేదు. దీంతో జయలలిత తోబుట్టువుల నుంచి రక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. డీఎన్ఏ పరీక్ష చేసి అమృతను జయలలిత కుమార్తెనా లేదా అనేది పెద్ద విషయం కాదని కూడా నిపుణులు చెప్తున్నారు. మరి ఆ పరీక్షలపై కోర్టు ఎలాంటి తీర్మానం తీసుకుంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీఎస్టీ తగ్గింపు... ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే...