Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

Advertiesment
woman

సెల్వి

, బుధవారం, 2 జులై 2025 (19:07 IST)
బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ క్యాంపస్‌లోని రెస్ట్‌రూమ్‌లో మహిళా సహోద్యోగులకు తెలియకుండా వీడియోలు చిత్రీకరించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని బెంగళూరు నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు స్వప్నిల్ నగేష్ (30) తన మొబైల్ ఫోన్‌లో వీడియోలను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. 
 
సోమవారం నాడు ఒక మహిళా ఉద్యోగి రెస్ట్‌రూమ్‌లోకి వెళుతుండగా తలుపు మీద అనుమానాస్పదంగా నీడ కనిపించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నిశితంగా పరిశీలించగా, నాగేష్ తనను రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆమె గుర్తించింది. షాక్‌కు గురైన ఆమె అలారం మోగించింది. నాగేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరింది. ఆపై ఆ యువతి ఫిర్యాదు తర్వాత, ఇన్ఫోసిస్ హెచ్‌ఆర్ సిబ్బంది అంతర్గత దర్యాప్తు ప్రారంభించారు. 
 
నాగేష్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, వారు రెస్ట్‌రూమ్ లోపల రహస్యంగా రికార్డ్ చేయబడిన సుమారు 30 వీడియోలను కనుగొన్నారు. వాటిలో వివిధ మహిళా ఉద్యోగులు ఉన్నారు. తన భార్య బాధితుల్లో ఒకరని తెలుసుకున్న ఫిర్యాదుదారుడి భర్త ఇన్ఫోసిస్ హెచ్‌ఆర్‌ను సంప్రదించాడు. 
 
తరువాత ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్‌లో అధికారిక పోలీసు ఫిర్యాదు నమోదు చేయబడింది. దీంతో పోలీసులు నాగేష్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇన్ఫోసిస్ ఇంకా బహిరంగ ప్రకటన విడుదల చేయలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రెయిన్ ట్యూమర్ కనుగొనడంలో చేసిన మార్గదర్శక పరిశోధనకు డాక్టరేట్ అందుకున్న కెఎల్‌హెచ్ స్కాలర్