Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూన్ లైటింగ్ ఉద్యోగులకు చిక్కులు - ఐటీ శాఖ నోటీసులు

computers
, మంగళవారం, 8 ఆగస్టు 2023 (16:01 IST)
కరోనా సమయంలో మూన్‌లైటింగ్‌ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఈ పదం ఎక్కువగా వినిపించింది. ఒక కంపెనీలో పూర్తి స్థాయిలో ఉద్యోగిగా పనిచేస్తూనే అదనపు ఆదాయం కోసం మరో సంస్థలో పనిచేసి కొందరు జీతం తీసుకున్నారు. మరి కొందరు నెలవారీ, ఇంకొందరు మూడు నెలలకోసారి చొప్పున ఆదాయం పొందారు. ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీన్ని సమర్థించగా.. మరికొందరు మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించారు. మూన్‌లైటింగ్‌కు పాల్పడిన వారిని కొన్ని సంస్థలు ఉద్యోగం నుంచి తొలగించాయి. ఇపుడు మరోమారు ఈ అంశం చర్చకు వచ్చింది. 
 
మూన్‌లైటింగ్‌ ద్వారా ఆదాయం పొందిన ఉద్యోగుల్లో కొందరు.. తమ ఆదాయాన్ని ఐటీ రిటర్నుల్లో చూపించకపోవడమే ఇందుక్కారణం. దీంతో ఆయా ఉద్యోగులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతానికి 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాల ఆదాయాలకు సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసినట్లు ఆంగ్ల పత్రిక 'ఎకనమిక్‌ టైమ్స్‌' పేర్కొంది.
 
ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగులు కేవలం ప్రధాన కంపెనీ ఆదాయాన్ని మాత్రమే రిటర్నుల్లో చూపించినట్లు ఐటీశాఖ గుర్తించింది. దీంతో ఆయా ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. తొలుత రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు వార్షికాదాయాన్ని రిటర్నుల్లో చూపించని వారికి ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. 
 
ఈ సంఖ్య దాదాపు వెయ్యికిపైనే ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ఉద్యోగులు మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారంటూ కొన్ని కంపెనీలే స్వయంగా ఐటీ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మున్ముందు మరింత మందికి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిందూ ధర్మంపై ఉన్న వాళ్లే టీటీడీ ఛైర్మెన్‌గా నియమించాలి : పురంధేశ్వరి